75 ఏళ్ల కల మోడీతో సాకారం | - | Sakshi
Sakshi News home page

75 ఏళ్ల కల మోడీతో సాకారం

Jun 8 2025 7:16 AM | Updated on Jun 8 2025 7:16 AM

75 ఏళ

75 ఏళ్ల కల మోడీతో సాకారం

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

మర్కూకు(గజ్వేల్‌): చీనాబ్‌ నదిపై వంతెన నిర్మించి ప్రధాని నరేంద్ర మోడీ 75 ఏళ్ల కలను సాకారం చేశారని మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు పేర్కొన్నారు. వంతెనతో జమ్మూ కశ్మీర్‌ను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు అనుసంధానం చేసిన ఏకై క నాయకుడని కొనియాడారు. మండలంలోని పాములపర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఘటన జరిగిన తర్వాత ఈనెల 6న ప్రధాని జమ్మూ కశ్మీర్‌ పర్యటనను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూసిందని, పాకిస్తాన్‌ మాత్రం తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామ్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు సత్తయ్య, శ్రీనివాస్‌ గుప్తా, నాయకులు పాల్గొన్నారు.

హ్యాండ్‌బాల్‌లో

రాణించిన క్రీడాకారులు

మద్దూరు(హుస్నాబాద్‌): రాష్ట్ర స్థాయి 46వ జూనియర్‌ బాలుర హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా జట్టు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని మండల హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మనోహర్‌ శనివారం తెలిపారు. నల్లగొండ జిల్లా మంగళపల్లిలో నాలుగు రోజులుగా జరిగిన పోటీల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా జట్టు నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సిద్దిపేట జిల్లా హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉపేందర్‌ గుప్తా, హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసు గౌడ్‌, హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మల్లేషం, జిల్లా హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ సభ్యులు మహమ్మద్‌, ఇంతియాజ్‌, కనకయ్య, తదితరులు అభినందించారు.

75 ఏళ్ల కల మోడీతో సాకారం  1
1/1

75 ఏళ్ల కల మోడీతో సాకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement