
ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలి
● జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్ రావు ● 18న హైదరాబాద్లో బహిరంగ సభ
మెదక్ కలెక్టరేట్: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆర్టిజన్ల జిల్లా సమావేశం జరిగింది. జిల్లా చైర్మన్ స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఈశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం, మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదన్నారు. దీన్ని నిరసిస్తూ ఈనెల 18న హైదరాబాద్ ఇందిరాపార్క్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు విద్యుత్ సంస్థ మేనేజ్మెంట్లకు కన్వర్షన్ కోసం సమ్మె నోటీసు ఇస్తామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి సమస్యను జేఏసీతో చర్చించి పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చంద్రారెడ్డి, సిద్దిపేట జిల్లా చైర్మన్ సధాకర్, జిల్లా కో కన్వీనర్ సందీప్, సంగారెడ్డి జిల్లా చైర్మన్ రాములు, జిల్లా కన్వీనర్ దుర్గయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా జేఏసీ నాయకులు కనకరాజు, రవికుమార్, జీన్నా, నాగరాజు, సురేష్, నర్సిహులు పాల్గొన్నారు.