
వైద్యులు అందుబాటులోనే ఉండాలి
జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి
హత్నూర( సంగారెడ్డి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని గాయత్రీదేవి అన్నారు . గురువారం మండల కేంద్రమైన హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గాయత్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించి ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చేవారం నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని స్థానిక వైద్యులకు సూచించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం వెంటనే అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యురాలు రజిని, సిబ్బంది ఉన్నారు