
భూ భారతితోనే పరిష్కారం
కలెక్టర్ వల్లూరు క్రాంతి
పటాన్చెరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం అమలులో పారదర్శకత, సమర్థత, వేగం తీసుకొచ్చేందుకు విశేష చర్యలు చేపట్టామని కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. పటాన్చెరు మండలం, క్యాసారం గ్రామంలో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో కలెక్టర్ క్రాంతి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ...జిల్లా వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించేందు కు విరివిరిగా మొక్కలు నాటాలన్నారు. ప్రజల భూ సమస్యలు తీర్చేది భూ భారతి చట్టమేనని స్పష్టం చేశారు.
నేడు దివ్యాంగుల ప్రజావాణి
సంగారెడ్డి జోన్: నేడు దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించే ఈ ప్రజావాణిలో దివ్యాంగులు తమ సమస్యలు, అవసరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.