
ఊరూరా.. ఉద్యమంలా
వర్గల్(గజ్వేల్): ప్లాస్టిక్ వినియోగం పెచ్చుమీరితే పర్యావరణానికి హానికరం. ఆకు విస్తర్లు కుడుతూ ‘ప్లాస్టిక్ వాడకం వద్దు..ఆరోగ్యకరమైన, పర్యావరణ హితమైన విస్తరాకులు వాడుదామని సందేశమిస్తున్నారు వర్గల్ మండల మహిళలు. గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు ‘పర్యావరణ పరిరక్షణకు మేము సైతం’ అంటూ ఆకు విస్తర్లు కుట్టి సిద్ధం చేసి పనిలో నిమగ్నమయ్యారు. సగటున ఒక్కో గ్రామపంచాయతీ నుంచి కనీసం 50 విస్తరాకుల చొప్పున సిద్ధం చేసి ఈ నెల 6 నుంచి హుస్నాబాద్లో జరగనున్న రైతు సదస్సులో వీటిని వినియోగించి ‘ప్లాస్టిక్ ప్లేట్లు వద్దు, పర్యావరణ హితం కోసం ఆకు విస్తర్లే ముద్దు’ అని సందేశం పంపాలన్నది అధికారుల సంకల్పం. బుధవారం ఊరూరా విస్తర్లు కుట్టించే కార్యక్రమం చేపట్టామని వర్గల్ పంచాయతీ కార్యదర్శి సందీప్కుమార్ తెలిపారు.