
సేంద్రియ కూరగాయల సాగు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పర్యావరణాన్ని కాపాడే దిశలో జిల్లా కేంద్రంలోని రాదారి నాగరాజు–కవిత దంపతులు ప్రయత్నిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి ఇల్లు ఒక చిన్నపాటి పంట చేను. పక్షులకు నీరు, తిండిగింజలు పెట్టడం, ఇంటి ముందు, టెర్రస్పై మొక్కలు పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. దంపతులిద్దరూ పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రికల్ వాహనాలనే వాడుతున్నారు. నాగరాజు దుబ్బాక మండలం లచ్చపేట మాడల్ స్కూలులో పీజీటీ ఆధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తుండగా, కవిత గృహిని. సేంద్రియ కూరగాయలు పండిస్తున్నారు. అలాగే వీరికి ఇద్దరు పిల్లలు. వారి పుట్టిన రోజున, ఇతర ప్రత్యేక రోజుల్లో విరివిగా మొక్కలు నాటుతున్నారు.