మ్యాప్‌ రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

మ్యాప్‌ రూపొందించాలి

Jun 5 2025 7:50 AM | Updated on Jun 5 2025 7:50 AM

మ్యాప

మ్యాప్‌ రూపొందించాలి

పోలింగ్‌ కేంద్రాలపై కలెక్టర్‌ వల్లూరు క్రాంతి
సంగారెడ్డికి కొత్త కమిషనర్‌

సంగారెడ్డి జోన్‌: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాల భౌగోళిక సమాచారం, సౌకర్యాలు, రవాణా మార్గాల భౌగోళిక మ్యాప్‌ (నజరీ నక్ష) రూపొందించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పడే పోలింగ్‌ కేంద్రాలకు బీఎల్‌ఓలను నియమించాలని స్పష్టం చేశారు. ఓటర్ల ఇంటింటి సర్వే నిర్వహణ, పోలింగ్‌ కేంద్రాల పెంపు వివరాలు, కుటుంబ సభ్యులు అందరూ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుని వాటిని ప్రభుత్వానికి అందజేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మాధురి, పటాన్‌చెరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి దేవుజా, నియోజవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

సంగారెడ్డి : ప్రస్తుతం సంగారెడ్డి కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌ చౌహన్‌ను ప్రభుత్వం సరెండర్‌ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం దుబ్బాక కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నియమించింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి రాత్రికి రాత్రే హడావుడిగా సంగారెడ్డి కొత్త కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బల్దియా సిబ్బంది కోరిక మేరకు వారందరినీ మంగళవారం మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ దేవాలయానికి తీసుకెళ్లారు. అయితే పనిదినాల్లో కొంతమంది సిబ్బంది కార్యాలయంలో లేకపోవడంతో విధులకు ఆటంకం కలిగినట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ దృష్టికి రాగా, ఈ విషయాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. పనిదినాల్లో సిబ్బందిని టూర్‌కు తీసుకెళ్లిన కమిషనర్‌ ప్రసాద్‌ చౌహన్‌ను కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బల్దియాలో ఒక్కరోజులో హైడ్రామా

పాత కమిషనర్‌ సరెండర్‌

హడావుడిగా బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషనర్‌

మ్యాప్‌ రూపొందించాలి1
1/1

మ్యాప్‌ రూపొందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement