వామ్మో.. జూన్‌! | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. జూన్‌!

Jun 5 2025 7:50 AM | Updated on Jun 5 2025 7:50 AM

వామ్మ

వామ్మో.. జూన్‌!

జోగిపేట(అందోల్‌): జూన్‌ వచ్చిందంటే చాలు సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులకు గుండె గుబేలుమంటుంది. ఈ నెలలోనే విద్యాసంస్థలు తెరచుకుంటాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల పెనుభారంగా మారుతున్నాయి. పిల్లలకు యూనిఫామ్‌, పాఠ్య, నోట్‌ పుస్తకాలు ఇతరత్రా అవసరాల కొనుగోలు లెక్కలు వేసుకుంటున్నారు. స్కూల్‌ ఫీజులు ఎంత?, యూనిఫామ్స్‌ ఖర్చు ఎంతవుతుంది? ఏ పాఠశాలలో చేర్పించాలి? యూనిఫామ్‌ కొనుగోలు, ఇంటినుంచి పాఠశాలకు పిల్లల రవాణా వంటి ఖర్చులతో సతమతమవుతుంటారు. తమ బిడ్డలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించాలన్న అత్యాశతో ఆయా వర్గాల తల్లిదండ్రులు అప్పులపాలు కావాల్సిన పరిస్థితులేర్పడుతున్నాయి.

కిండర్‌ గార్డెన్స్‌కే వేలకు వేలు

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు వేలకు వేలు చెల్లించాల్సి ఉండగా, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోకపోతుండటంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారీతిలో తల్లిదండ్రుల నుంచి ఫీజులను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఎల్‌కేజీ, యూకేజీలల్లో చేర్పించాలంటే రూ.వేలకువేలు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు అధిక ధరలను భరించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఫీజుల కోసం అప్పులు

పిల్లల ఫీజుల కోసం పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. చేబదులు, వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు స్కూల్‌ ఫీజుల విషయంలో నర్సరీలోనే రూ.35 వేలకు పైగా చెల్లించాల్సి ఉండగా..కొంచెం పేరున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెనుభారంగానే మారాయి. ఇద్దరు పిల్లలకు ఫీజులు చెల్లించాల్సి వస్తే రూ.లక్ష పైగానే జూన్లో సమకూర్చుకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. వీటికి తోడు ఇతరత్రా ఖర్చులు ఉండనే ఉన్నాయి.

పిల్లల చదువు ఖర్చులకు తల్లిదండ్రులు బెంబేలు

పేద, మధ్య తరగతికి భారంగా ఉన్న ప్రైవేటు స్కూలు ఫీజులు

ఫీజుల నియంత్రణపై కొరవడిన పర్యవేక్షణ

ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకుంటాం

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,351 పాఠశాలలున్నాయి. 423 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన చేస్తున్నా ప్రైవేట్‌ వైపు కొంతమంది మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నాం. అధిక ఫీజులు వసూలు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు పంపిణీ జరుగుతుంది.

–వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి

వామ్మో.. జూన్‌!1
1/1

వామ్మో.. జూన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement