
అరుణాచలంకు ప్రత్యేక బస్సులు
నారాయణఖేడ్: ఈనెల 11న పౌర్ణమిని పురస్కరించుకుని ఖేడ్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం మల్లేశయ్య తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మధ్యలోని మరోమూడు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైనన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బస్సులు ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు ఖేడ్ నుంచి అరుణాచలంకు బయలుదేరుతాయన్నారు. 10వ తేదీ ఉదయం కాణిపాకం, సాయంత్రం గోల్డెన్టెంపుల్ దర్శించుకుని అక్కడి నుంచి బయల్దేరి 11న పౌర్ణమినాడు ఉదయం అరుణాచలం చేరుకుంటాయని తెలిపారు. గిరి ప్రదక్షణ అనంతరం 12న ఉదయం జోగుళాంబ తల్లి అమ్మవారి శక్తిపీఠం దర్శించుకున్నాక బయల్దేరి అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఖేడ్కు చేరుకుంటాయని తెలిపారు. రాను పోనూ ఒకొక్కరికీ రూ.4,500 చార్జీ ఉంటుందన్నారు. టికెట్లు బుక్ చేసుకునేందుకు 9959223170, 9441071134, 9676667703, 9063417294 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కొనసాగుతున్న
భూభారతి సదస్సులు
జిన్నారం (పటాన్చెరు): ఉమ్మడి జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో భూభారతి సదస్సులు రెండవ రోజు కొనసాగుతున్నాయి. జిన్నారం మండలంలోని అండూర్, బొల్లారం మున్సిపాలిటీలో తహసీల్దార్ దేవదాసు ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలంలో అనంతారం గ్రామాల్లో తహసీల్దార్ పరమేశం రైతుల సమక్షంలో సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా భూసమస్యలపై రైతుల నుంచి జిన్నారం మండలంలో 96, గుమ్మడిదల మండలంలో 16 అర్జీలు అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూమ్
ఇళ్లపై విచారణ
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూర్ ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వం ఇళ్లను కేటాయించి లబ్ధిదారుల్లో ఎంతమంది ఇళ్లలోకి వచ్చారు? ఎవరైనా లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను అద్దెకిచ్చారా? వంటి అంశాలపై ఆరా తీశారు. అదే విధంగా ఎంతమంది లభ్ధిదారులు ఇప్పటి వరకు కేటాయించిన ఇళ్లలోకి రాలేదన్న విషయంపై విచారణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఓ వెంకటరామయ్య, ఆర్ఐ శ్రీకాంత్, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

అరుణాచలంకు ప్రత్యేక బస్సులు