సొంతింటి కల నెరవేరుస్తాం | - | Sakshi
Sakshi News home page

సొంతింటి కల నెరవేరుస్తాం

Jun 5 2025 7:50 AM | Updated on Jun 5 2025 7:50 AM

సొంతింటి కల నెరవేరుస్తాం

సొంతింటి కల నెరవేరుస్తాం

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

కల్హేర్‌(నారాయణఖేడ్‌): ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి పేర్కొన్నారు. కల్హేర్‌, మార్డి, బీబీపేట్‌, ఫత్తేపూర్‌, పోమ్యనాయక్‌ తండాలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లిస్తుందని తెలిపారు. ఎవరైనా మిగిలి ఉంటే ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమేశ్‌బాబు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బూర్గుల పోచయ్య, మాజీ సర్పంచ్‌ లక్ష్మినారాయణ, నాయకులు తుకారాం, దేవదాస్‌, వీర్‌శెట్టి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

అర్హులైన పేదలకు ఇళ్లు పంపిణీ

కంగ్టి(నారాయణఖేడ్‌): ఇళ్లు లేని ప్రతీ పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి పేర్కొన్నారు. కంగ్టి మండలంలోని రాంతీర్థ్‌, ఎన్కెమూరి గ్రామాల్లో ఎమ్మెల్యే అర్హులైన పేదలకు ఇళ్లు పంపిణీ చేశారు. గూడు లేని పేదలందరికి ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అనంతరం పలు గ్రామాల్లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య, ప్రత్యేకాధికారి నూతన్‌కుమార్‌, ఏఈ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement