
భూ బాధితులకు బాసట
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల భూ బాధితులకు అండగా ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు పొన్నాల శ్రీనివాసరెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డి వివాహ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన తేనేటి విందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుమ్మడిదల పరిధిలోని సర్వేనంబర్ 109 భూ బాధితులు వారి సమస్యలను హరీశ్రావుకు విన్నవించారు. భూ సమస్య పరిష్కారానికి తన సంపూర్ణ సహకారం అందిస్తామని భూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, వెంకటేశంగౌడ్, కుమార్గౌడ్, బాల్రెడ్డి, సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్రావు