
సాగును ఆదాయాధారితంగా మలచుకోవాలి
ఏడీఏ భిక్షపతి
జహీరాబాద్: రైతులు శాసీ్త్రయ పద్ధతులను అవలంబించి తమ వ్యవసాయాన్ని ఆదాయాధారితంగా మలుచుకోవాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భిక్షపతి సూచించారు. మండలంలోని హుగ్గెళ్లి గ్రామ రైతు వేదికలో బుధవారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మట్టి పరీక్షల అవసరం గురించి వివరించారు. భూసారాన్ని పెంచుకునేందుకు పచ్చిరొట్టె ఎరువుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని పంటల నిర్వహణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త అరుణ, మండల వ్యవసాయాధికారి లావణ్య, కేవీకే శాస్త్రవేత్తలు వరప్రసాద్, స్నేహలత, గోద్రేజ్ సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.