
నాణ్యమైన విత్తనాలతోనే దిగుబడులు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాఽధించవచ్చని సీడీసీ చైర్మన్ రాంరెడ్డి రైతులకు సూచించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టిన ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’కార్యక్రమాన్ని మంగళవారం మండలంలోని మద్దికుంట రైతువేదికలో డీఏఓ శివప్రసాద్,వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్తో కలిసి రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు సన్నరకం వరి,పెసర,కంది విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచి దిగుబడిని సాధిం ంచాలన్నారు. రోహిణి కార్తిలోనే వరి నార్లు పోసుకోవడం ద్వారా బలంగా పెరిగి చీడపీడలను తట్టుకుని ముందుగా పంట చేతికి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకటలక్ష్మి,ఏఎంసీ చైర్మన్ కుమార్,ఏఓ రమేశ్,ఏఈఓలు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
మూల విత్తనాల పంపిణీ జరగాలి
సంగారెడ్డి టౌన్: విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా రైతులకు విత్తనాల పంపిణీ సజావుగా జరగాలని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త బాలాజీ నాయక్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి రైతువేదికలో మంగళవారం రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు దివ్యజ్యోతి, ఝాన్సీలక్ష్మి, శ్రావణ్కుమార్, గాయత్రీసౌజన్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రాయికోడ్ మండలంలో..
రాయికోడ్(అందోల్): మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంటల సాగుపై శాస్త్రవేత్తలు, అధికారులు సూచనలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి కంది, పెసర విత్తనాలను ఎంపిక చేసిన రైతులు మొగులప్ప, బక్కప్ప తదితరులకు అందజేసినట్లు ఏఈఓ నికిలేశ్ తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు నాగిశెట్టి పాటిల్, హన్మంగొండ, ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏసయ్య, నాయకులు ఉన్నారు.
సీడీసీ చైర్మన్ రాంరెడ్డి