
పొలానికి నీళ్లు పెట్టి వస్తుండగా..
కౌడిపల్లి(నర్సాపూర్): పొలం దగ్గరికీ వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తునికిగేట్ సమీపంలోని దేవులతండావద్ద 765డి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం.. దేవలతండాకు చెందిన కోల రమేష్(38) వ్యవసాయంతోపాటు గేదెలను పెంచుతున్నాడు. వీటి మేత కోసం పొలంలో పచ్చిగడ్డి సాగు చేశాడు. సోమవారం రాత్రి మడికి నీళ్లు పారించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తూ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న క్రమంలో మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వైపు వెళ్తున్న కారు రమేష్ను ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. మృతుడికి భార్య నీల, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మహిళ..
కొండపాక(గజ్వేల్): రోడ్డు దాటుతున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కుకునూరుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని మంగోల్ గ్రామానికి చెందిన లగిశెట్టి మణెమ్మ(50) మనవడు అశ్విత్తో కలిసి ఆటోలో కుకునూరుపల్లికి మిరపకాయలు పట్టించడానికి బయలు దేరారు. ఈ క్రమంలో ఆటో దిగి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కరీంనగర్కు ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళ్తున్న సెంట్రల్ పోలీస్ లైన్లో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్న బుర్కి దేవానంద్ మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆమె ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కానీ ద్విచక్ర వాహనదారుడు వాహనాన్ని ఆపకుండా సుమారు కిలో మీటరు దూరం వరకు వెళ్లాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు ద్విచక్ర వాహనదారున్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహం వద్ద నానమ్మ, నానమ్మ అంటూ 12 ఏళ్ల మనవడు అశ్విత్ రోదించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. వాహనం ఆపకుండా వెళ్లడం పట్ల మృతురాలి కుటుంబీకులు, గ్రామస్తులు పోలీస్టేషన్కు వెళ్లి గొడవకు దిగారు. పోలీసులు సర్ది చెప్పి, కేసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైతును ఢీకొట్టిన కారు
ప్రమాదంలో అక్కడికక్కడే మృతి