
నిరుపేద కుటుంబానికి చేయూత
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణానికి చెందిన నామ రవికిరణ్ పేదవారికి చేయూతనిస్తున్నారు. పట్టణంలోని బాగారెడ్డిపల్లికి చెందిన మక్కల రాములు ఐదుగురు సంతానంతో చాలాకాలం నుంచి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. భార్య చనిపోవడంతో పాటు ఐదుగురు పిల్లలతో తలదాచుకునేందుకు గూడు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గుహ లాంటి రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాములు కుటుంబ పరిస్థితిని గమనించిన బీఆర్ఎస్ నాయకుడు, నామ సుభద్రమ్మ ట్రస్టు అధ్యక్షుడు నామ రవికిరణ్ సొంత ఖర్చుతో ఇల్లు కట్టించాడు. హరీశ్ రావుకు అభిమాని అయిన రవికిరణ్ ఆయన పుట్టినరోజున ఎమ్మెల్యే మాణిక్రావు చేతుల మీదుగా ప్రారంభించి ఇంటి తాళాలను రాములుకు అప్పగించారు. ఈ సందర్భంగా మాణిక్రావు మాట్లాడుతూ రవికిరణ్ పేద కుటుంబానికి ఇల్లు కానుకగా ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సొంత డబ్బులతో
ఇల్లు కట్టించిన నామ రవికిరణ్
ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్రావు

నిరుపేద కుటుంబానికి చేయూత