
భూ భారతితో రైతులకు న్యాయం
ఎంపీ సురేష్కుమార్ షెట్కార్
న్యాల్కల్(జహీరాబాద్): రైతులకు న్యాయం చేసేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ అన్నారు. బీఆర్ఎస్ తీసుకువచ్చిన ధరణి పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. మండలంలోని మిర్జాపూర్(ఎన్)గ్రామంలో మంగళవారం భూ భారతి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హాజరై మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకే ధరణిని తొలగించి భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. భూములకు సంబంధించిన సమస్యలు సాధ్యమైనంత వరకు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారమవుతాయన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న చెరుకు రైతుల కోసం చెరకు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, టీజీఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్ అహ్మద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్రెడ్డి, తిరుపతిరెడ్డి, కేతకీ ఆలయ చైర్మన్ శేఖర్, నాయకులు ్డ పాల్గొన్నారు.