
దొంగలు.. బాబోయ్ దొంగలు
దుబ్బాక : వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్ వైర్ల చోరీలు పెరిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలలుగా దుబ్బాక పట్టణంతోపాటు మున్సిపాల్టీ పరిధిలోని చేర్వాపూర్, చీకోడ్ రోడ్డు, దుంపలపల్లి రోడ్డులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రాంతంలో వ్యవసాయబోరు మోటార్ల కేబుల్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేసుకొని ఎత్తుకెళ్లారు. పదుల సంఖ్యలో రైతుల మోటార్ల నుంచి కేబుల్ వైర్లు ఎత్తుకెళ్తుతుండటంతో రైతులకు ఇబ్బందిగా తయారైంది. మళ్లీ బోరు మోటార్ పైకి తీయడం, కొత్త కేబుల్ వైర్ వేయాల్సి వస్తుండటంతో ఒక్కో రైతుకు రూ.4 నుంచి రూ.5 వేల వరకు ఖర్చు అవుతుండడంతో రైతులకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దొంగతనాలపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకొని చోరీలు అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
రేబర్తిలో కాపర్ వైర్ చోరీ
మద్దూరు(హుస్నాబాద్): ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీకి గురైన ఘటన మండలంలోని రేబర్తి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రేబర్తి గ్రామానికి చెందిన బెల్లపు యాదయ్య వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు పగులగొట్టి అందులోని కాపర్ వైర్ చోరీ చేశారు. ఆదివారం ఉదయం రైతులు పొలం వద్దకు వెళ్లి చూసే సరికి ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టి ఉండటంతో విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొద్ది రోజులుగా మండలంలో ట్రాన్స్ఫార్మర్ చోరీలు జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
విచ్చలవిడిగా బోర్ మోటార్ల కేబుల్ వైర్లు చోరీ
ఆందోళన చెందుతున్న రైతులు

దొంగలు.. బాబోయ్ దొంగలు