రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Jun 2 2025 7:39 AM | Updated on Jun 2 2025 7:39 AM

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

కొండపాక(గజ్వేల్‌): రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన తిమ్మారెడ్డిపల్లి శివారులో గల కొమురవెల్లి కమాన్‌ వద్ద చోటు చేసుకుంది. కుకునూరుపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్‌ కథనం మేరకు.. కరీంనగర్‌ పట్టణానికి కడారి రవి (58) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అతడి స్నేహితుడు గుంపుల రాజ్‌కుమార్‌ విద్యుత్‌ శాఖలో పని చేస్తున్నాడు. రవికి హైదరాబాద్‌లో స్పోర్ట్స్‌కు సంబంధించిన మీటింగ్‌ ఉండటంతో కారులో స్నేహితుడు రాజ్‌కుమార్‌తో కలిసి ఆదివారం కరీంనగర్‌ నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో తిమ్మారెడ్డిపల్లి శివారులో గల కొమురవెల్లి కమాన్‌ వద్ద రాగానే కారు అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవికి తీవ్ర, రాజ్‌కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో సిద్దిపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొంతుతూ రవి మృతి చెందాడు. మృతుని భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యుదాఘాతంతో గిరిజన యువకుడు

పాపన్నపేట(మెదక్‌): విద్యుదాఘాతంతో గిరిజన యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పొడిచన్‌పల్లి తండాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం మేరకు.. తండాకు చెందిన ధరావత్‌ మోహన్‌ (42)హిందీ పండిత్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసి డీఎస్సీ కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు. కొత్తగా కట్టిన బాత్‌ రూమ్‌ గోడలు క్యూరింగ్‌ చేసే క్రమంలో సింగిల్‌ ఫేజ్‌ మోటార్‌ను ఆన్‌ చేశాడు. మోటార్‌కు విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో కరెంట్‌ షాక్‌ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీలకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరొకరికి స్వల్ప గాయాలు

లారీని ఢీకొట్టిన కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement