కేతకీ భక్తజన సంద్రం | - | Sakshi
Sakshi News home page

కేతకీ భక్తజన సంద్రం

Apr 28 2025 7:26 AM | Updated on Apr 28 2025 7:26 AM

కేతకీ

కేతకీ భక్తజన సంద్రం

ఝరాసంగం(జహీరాబాద్‌): కేతకీ సంగమేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి గుండంలోని జలలింగానికి పూజలు చేశారు. భక్తుల సౌకర్యం కోసం ధర్మదర్శనంతోపాటు ప్రత్యేక దర్శనం, వీఐపీ దర్శనాలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ శివారుద్రప్ప, పాలకమండలి కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

అమావాస్య పూజలు చేసిన భక్తులు

కేతకీ భక్తజన సంద్రం1
1/2

కేతకీ భక్తజన సంద్రం

కేతకీ భక్తజన సంద్రం2
2/2

కేతకీ భక్తజన సంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement