ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

Published Sat, Jun 15 2024 8:20 AM | Last Updated on Sat, Jun 15 2024 8:20 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

నారాయణఖేడ్‌: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని నెహ్రూనగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ స్వరూప్‌ షెట్కార్‌, వైస్‌ చైర్మన్‌ దారం శంకర్‌లతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యకు అధికప్రాధాన్యత ఇస్తుందన్నారు. సర్కార్‌ బడుల్లోనే నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో పాటు మౌళిక వసతులు ఉంటాయని తెలిపారు. అంతకుముందు చిన్నారులచే ఎమ్మెల్యే అక్షర శ్రీకారం చేయించారు. కార్యక్రమంలో ఎంఈఓ విశ్వనాథం, మాజీ ఎంపీటీసీలు ముంతాజ్‌, పండరిరెడ్డి, శంకర్‌ ముదిరాజ్‌ ఉన్నారు.

కంగ్టి(నారాయణఖేడ్‌): మండలంలోని తుర్కవడ్‌గాం, రాజారాంతండా ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంఈఓ శంకర్‌, ఎంపీడీఓ సత్తయ్య, తహసీల్దార్‌ విష్ణుసాగర్‌, మాజీ సర్పంచ్‌ పల్లవి పరశురాం రాథోడ్‌, ఉపాధ్యాయులు కిఫాయత్‌అలీ, విఠల్‌రెడ్డి, సంగ్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement