గన్ఫౌండ్రీ: నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రైవేట్ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని విశ్రాంత డీజీపీ గోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఆదర్శ్నగర్లోని బిర్లా ప్లానిటోరియంలో హైదరాబాద్ ప్రొఫెషనల్ ప్రీమియర్ లీగ్ (హెచ్పీపీఎల్) సీజన్ వన్ జెర్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు మధురానగర్లోని స్పోర్ట్స్ ఎరీనాలో మ్యాచ్లు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో సినీ నటుడు సత్యం రాజేష్, లీగ్ నిర్వహకులు పుట్టపర్తి నవ్యజోతి, విక్రమ్ రెడ్డి, భూపాల్ రెడ్డి, చగన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.


