పెద్ద చెరువును రక్షించండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కాలుష్యం కోరల్లో కూరుకుపోతున్న పెద్ద చెరువును రక్షించి ఇక్కడి ప్రజల జీవితాలను కాపాడాలని ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ను స్థానికులు కోరారు. ఇబ్రహీంబాగ్లోని 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్న నేపథ్యంలో స్థానికులు ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్కు తమ సమస్యలను వివరించారు. మణికొండ, పుప్పాలగూడ, అల్కాపూర్, ఓయూ కాలనీ ప్రాంతాల నుంచి నియంత్రణలేని మురుగు ప్రవాహం చెరువును దెబ్బతీస్తోందన్నారు. చెరువు జీవవైవిధ్యం నాశనం అవుతోందని, దుర్వాసన, అపరిశుభ్రవాతావరణం స్థానికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. మురుగు ప్రవాహం చెరువులోకి రాకుండా నిలిపి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) ఏర్పాటు, చెరువు శుభ్రపరిచే పనులు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెరిక సురేశ్, వెంగల్రెడ్డి, దయానంద్పటేల్, శ్రీరాంరెడ్డి, భీంరెడ్డి, రాకేశ్ పటేల్, వెంకట్, శ్రీనివాస్కల్యాణ్, డేవిడ్, రాంగోపాల్, దీప్తి, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్కు స్థానికుల వినతి


