గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి

Dec 1 2025 9:56 AM | Updated on Dec 1 2025 9:56 AM

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి

యాచారం: నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆదివారం జింక మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. గునుగల్‌ అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింకను సాగర్‌ రోడ్డుపై అతి వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని కళేబరాన్ని అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. జింక మృతికి కారణమైన గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement