వదిలిపెట్టే ప్రసక్తే లేదు | - | Sakshi
Sakshi News home page

వదిలిపెట్టే ప్రసక్తే లేదు

Oct 6 2024 3:38 AM | Updated on Oct 6 2024 3:38 AM

వదిలిపెట్టే ప్రసక్తే లేదు

వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఆ భూములను రక్షించండి ప్రభుత్వ భూములను రక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

10లోu

కందుకూరు: ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీని వదిలేది లేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా తదితర సమస్యలపై బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో రైతు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ హోంమంత్రి మహమూద్‌ ఆలీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభివాణీదేవి, శంభీపూర్‌రాజు, నరేందర్‌కు మార్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, ఆనంద్‌, మహేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌, పార్టీ రాష్ట్ర నాయకులు కార్తీక్‌రెడ్డి, క్యామ మల్లేష్‌, రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు కేసీఆర్‌ హయాంలో అమలు చేసిన పథకాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రుణమాఫీ పూర్తి చేయడంలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. మరోవైపు మైక్‌ తీసుకుంటే చాలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావును తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్‌ హయాంలో కంపెనీలు తెచ్చి లక్ష మందికి ఉపాధి లభించేలా చేశామని.. తొమ్మిది నెలల పాలనలో కాంగ్రెస్‌ ఏ ఒక్క కంపెనీ తేలేకపోయిందన్నారు. ఈ ప్రాంత రూపురేఖలు కేసీఆర్‌, కేటీఆర్‌ మార్చారని కొనియాడారు. తనకు మూడు ఫాంహౌస్‌లు ఉన్నాయని, వాటిని కూల్చుతామని రేవంత్‌రెడ్డి అంటున్నాడని, అవి ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ హయాంలో రైతుకు భరోసా

ఎమ్మెల్సీ సురభివాణీదేవి మాట్లాడుతూ.. రైతు కూలీని రైతును చేసింది మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అయితే రైతుకు భరోసా కల్పించి వ్యవసాయం అంటే పండుగలా చేసింది కేసీఆర్‌ అన్నారు. ఫోర్త్‌సిటీలోకి గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని 300 అడుగుల మేర నిర్మించడం బదులు ప్రస్తుతం ఉన్న శ్రీశైలం రహదారిని విస్తరించాలన్నారు.

ఇలాంటి సీఎంను చూడలేదు

మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాట మేర రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదన్నారు. రియల్‌ ఎస్టేట్‌ కోసం, అత్తగారింటి కోసం రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ అంటే భారతీయ రైతు సమితి

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అంటేనే భారతీయ రైతు సమితి అన్నారు. రైతులను రాజు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి కూల్చుడే కానీ కట్టడం తెలియదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రజనీసాయిచంద్‌, చిలకమర్రి నర్సింహ, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, జిల్లా ఉపాధ్యక్షులు జి.లక్ష్మీనర్సింహారెడ్డి, కాకి దశరథ, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మేఘనాథ్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు టి.ఇందిర, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ హామీలు అమలు చేసే దాకా

వెంటపడుతూనే ఉంటాం

రైతుధర్నాలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement