
మొక్కలు నాటి సంరక్షించాలి
● సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీహరి ప్రసాద్
వీర్నపల్లి(సిరిసిల్ల): ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి, సంరక్షించాలని సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీహరిప్రసాద్ కోరారు. ప్రపంచ పర్యావరణ వా రోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం వీర్నపల్లి మండలం రాశిగుట్టతండాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మే 22 నుంచి జూన్ 6 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు ముందుకురా వాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జూట్ బ్యాగులను వాడాలని సూచించారు. గతంలో ఇచ్చిన పోడు పట్టాలకు మించి అటవీ భూమి లో సాగుచేస్తే చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. తహసీల్దార్ ముక్తార్పాషా, ఎస్సై ఎల్లయ్యగౌడ్, మండల అబివృద్ధి అధికారి వాజిద్, వీర్నపల్లి సెక్షన్ అధికారి రంజిత్కుమార్, మోహన్లాల్, అంజలి, భూలక్ష్మి, పద్మలత, సక్కారాం పాల్గొన్నారు.
నేడు కేంద్ర మంత్రి సంజయ్ పర్యటన
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని వెంకట్రావుపల్లి–జగ్గారావుపల్లి గ్రామాల పరిసరాల్లో నిర్మించే బ్రిడ్జి పనులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ శనివారం శంకుస్థాపన చేస్తారని బీజేపీ మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురామ్ శుక్రవారం తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనలో మండలానికి చెందిన బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.