సిరిసిల్లకల్చరల్: ఆర్జీ రావు ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత ఇంజినీరింగ్ విద్యావకాశాల కోసం నిర్వహించిన అర్హత పరీక్షకు స్పందన లభించింది. రగుడులోని రంగినేని మోహన్రావు చారిటబుల్ ట్రస్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 500 మంది విద్యార్థులు హాజరైనట్లు ట్రస్టు నిర్వాహకుడు బొంత దామోదర్ తెలిపారు. ట్రస్టు నిర్వాహకుడు రంగినేని మోహన్రావు, ఆర్జీ రావు ట్రస్టు మేనేజర్ రాకేశ్, ట్రస్టు కాలేజీ ఇన్చార్జి దినేశ్, ఉపాధ్యాయులు సలా వుద్దీన్, శంకర్, విష్ణు, సతీశ్ పాల్గొన్నారు.
విద్యార్థులు గ్రామాల్లో సేవ చేయాలి: జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం
బోయినపల్లి(చొప్పదండి): విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవచేయాలని జిల్లా సంక్షేమాధికారి పి.లక్ష్మీరాజం కోరారు. బాబూ జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు మండలంలోని తడగొండలో గురువారం ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించారు. కళాశాల అసోసియేట్ డీన్ కేపీ సునీతాదేవి మాట్లాడుతూ గ్రామంలో వారంపాటు నిర్వహించే శిబిరంలో వివిధ కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. శిశు సంక్షేమాధికారి రోజా, ఎంఏవో ప్రణిత, ప్యాక్స్ డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు టి.అరుణ్బాబు, పి.మాధవి, మాజీ సర్పంచ్ చిందం రమేశ్ పాల్గొన్నారు.
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పేర్కొన్నారు. మండలంలోని కోరెంలో టీచర్లకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఎండాకాలంలో నెల రోజులు ప్రీ స్కూల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తామన్నారు.
పనిముట్లతో స్వర్ణకారుల నిరసన
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని స్వర్ణకారులు చేపట్టిన రిలేదీక్షలకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి గురువారం సంఘీభావం తెలిపారు. స్వర్ణకారుల కులవృత్తులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్వర్ణకారులు తమ పనిముట్లతో ఆందోళన చేపట్టారు. పట్ట ణాధ్యక్షుడు గజ్జెల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, దీటి నర్సింలు, నరేశ్, భా ను, బాల్రెడ్డి, ప్రశాంత్, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు చింతోజు బాలయ్య, బ్రహ్మం, శ్రీను, అనిల్, వెంకటేశం పాల్గొన్నారు.
‘‘చీటి’ పార్టీకి పనికిరాడు’
సిరిసిల్లటౌన్: పార్టీకి ఎలాంటి పనిచేయని చీటి ఉమేశ్రావుతో సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్కు లాభం లేదని ఆ పార్టీకి చెందిన మండలాల అధ్యక్షులు అధిష్టానాన్ని కోరారు. సిరిసిల్లలో కోవర్ట్ రాజకీయాలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. చీటి ఉమేశ్రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరా రు. ఆయన ప్రవర్తన ఆది నుంచి అనుమానంగా, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ల మెప్పుకోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని ఆరోపించారు. ఈవిషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గ్రహించి అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు జల గం ప్రవీణ్, ముస్తాబాద్ మండలాధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి, బొప్ప దేవయ్య, రెడ్యానాయక్, రవికుమార్, కల్లూరి చందన పాల్గొన్నారు.