ఎస్సీ, ఎస్టీ కోర్టు మంజూరు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ కోర్టు మంజూరు చేయండి

May 2 2025 1:29 AM | Updated on May 2 2025 1:29 AM

ఎస్సీ, ఎస్టీ కోర్టు మంజూరు చేయండి

ఎస్సీ, ఎస్టీ కోర్టు మంజూరు చేయండి

సిరిసిల్లకల్చరల్‌: జిల్లా కేంద్రానికి ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక న్యాయస్థానాన్ని మంజూరు చేయాలని న్యాయవాదుల సంఘం కోరింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జిల్లా అడ్మినిస్ట్రేటీవ్‌ జడ్జి జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావును హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ కోర్టు ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్‌లో ఉండడంతో కక్షిదారులకు దూరభారం అవుతోందన్నారు. జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కోర్టును మంజూరు చేయాలని ప్రతిపాదించారు. బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తంగళ్లపల్లి వెంకటి, ఎస్‌.అనిల్‌కుమార్‌, వేముల నరేశ్‌, నర్మెట రమేశ్‌, వుచ్చిడి శరత్‌రెడ్డి, మహిళా ప్రతినిధి మంద పుష్పలత, సీనియర్‌ న్యాయవాది దోర్నాల జనార్దన్‌రెడ్డి, న్యాయవాదులు అన్నల్‌దాస్‌ వేణు, కడగండ్ల తిరుపతి, బూర్ల కల్యాణి, బి.అనీల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement