
బీసీల పోరాట ఫలితమే కులగణన
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు
సిరిసిల్లటౌన్: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీసీల పోరాటాల ఫలితంగానే దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం ముందుకొచ్చిందన్నారు. తెలంగాణలో 42 శాతం, బిహార్లో 65 రిజర్వేషన్ను కేంద్రం ఆమోదించాలని కోరారు. బీసీ నాయకులు వీరవేని మల్లేశ్యాదవ్, కమలాకర్, బొప్ప దేవయ్య, తడుక కమలాకర్, ఇల్లంతకుంట తిరుపతి, బచ్చు ప్రసాద్, సామల తిరుపతి, కొండ విజయ్, తొట్ల మల్లేశం, రోహిత్యాదవ్, కొండయ్య, దామోదర్, శ్రీనివాస్, నరేందర్, శ్రీధర్ పాల్గొన్నారు.