
నేత ఇంట్లో సెకండ్ ర్యాంకర్
ముస్తాబాద్(సిరిసిల్ల): నేతకార్మికుడి కొడుకు పదో తరగతిలో జిల్లా టాపర్గా నిలిచాడు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో చదువుతున్న జక్కని విగ్నేశ్ 600 మార్కులకు 580 సాధించి జిల్లా రెండో ర్యాంక్ సాధించాడు. టెక్స్టైల్పార్క్కు చెందిన విగ్నేశ్ ముస్తాబాద్ గురుకులంలో చదువుతున్నాడు. తండ్రి జక్కని రాజు నేతకార్మికుడు కాగా.. సరైన ఉపాధి లేక సిరిసిల్ల మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. తల్లి జమున బీడీకార్మి కురాలు. విగ్నేశ్ మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రత్యేక ప్రణాళికతో చదివానని తెలిపాడు. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలనేది తన లక్ష్యమని పేర్కొన్నాడు.