విన్నపాలు వినవలే.. | - | Sakshi
Sakshi News home page

విన్నపాలు వినవలే..

Apr 29 2025 12:06 AM | Updated on Apr 29 2025 12:06 AM

విన్న

విన్నపాలు వినవలే..

● సమస్యలు విన్నవించిన బాధితులు ● సత్వర పరిష్కారం చూపుతామన్న కలెక్టర్‌ ● 209 దరఖాస్తులు స్వీకరణ

సన్నధాన్యం కేటాయించొద్దు

రబీ సీజన్‌ సన్నధాన్యం సేకరణ ప్రభుత్వం ప్రారంభించింది. మన జిల్లా పారాబాయిల్డ్‌ వైరెటీ ధాన్యం వచ్చింది. ఈ ధాన్యం నుంచి పచ్చిబియ్యం పెట్టలేము. ఆ ధాన్యంలో ఎక్కువ నూక వస్తుంది. కానీ అధికారుల నుంచి సన్నధాన్యం నుంచి పచ్చిరైస్‌ పెట్టమని ఆదేశాలున్నాయి. దాని సీఎంఆర్‌ రా రైస్‌ పెట్టలేకుండా ఉన్నాము. మాకు సన్నధాన్యం కేటాయించొద్దు. – పారాబాయిల్డ్‌ మిల్లర్స్‌

పనులు పూర్తిచేయించండి

సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం అభివృద్ధి పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మైదానం ఎత్తు పెంచడం, క్రీడల కోర్టులు, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం పనులు చేపట్టారు. అయితే గ్రౌండ్‌కు నలువైపులా గేట్లు, వీధిదీపాలు లేక రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నిలిచిన పనులు పూర్తిచేయించి వసతులు పూర్తి చేయాలి.

– వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

కొడుకులు

పట్టించుకోవడం లేదు

మాది సిరిసిల్ల పోచమ్మవీధి. నా భర్త హరయ్య చాలా ఏళ్ల క్రితమే కాలం చేశారు. నాకు ఆర్థికంగా స్థిరపడిన నలుగురు కొడుకులు, ఇద్దరు పెళ్లయిన కూతుళ్లు ఉన్నారు. కొడుకుల్లో రిటైర్డ్‌ ఉద్యోగి, మాజీ ప్రజాప్రతినిఽధి, ఇద్దరు వ్యాపారులు. నా భర్త పోయినప్పటి నుంచి బీడీ పింఛన్‌, ఈపీఎఫ్‌ డబ్బులతోనే బతుకుతున్న. ముప్పై ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నా. నాకు అ య్యే వైద్యఖర్చులకు పెద్దకుమార్తె కొడుకు నెలకు రూ.7వేలు ఇస్తున్నాడు. ఇప్పుడు పూర్తిగా చేతకావ డం లేదు. నలుగురు కొడుకులున్నా ఎవరూ అండగా ఉండడం లేదు. కొడుకులు ఒక్కొక్కరి నుంచి రూ.20వేలతోపాటు తోడుగా ఒకరు ఉండేలా చర్యలు తీసుకోండి.

– గుడ్ల సత్తమ్మ, సిరిసిల్ల

సిరిసిల్లటౌన్‌: సుదీర్ఘకాలంగా తమ సమస్యలు విన్నవిస్తూనే ఉంటున్నామని.. క్షేత్రస్థాయిలో అధికారులు పరిష్కరించడం లేదని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వందలాది సంఖ్యలో బాధితులు వచ్చి గంటల తరబడిగా వేచి ఉండి కలెక్టర్‌కు తమగోడు వెల్లబోసుకున్నారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా స్పందిస్తూ ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 209 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రెవెన్యూకు 36, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు 26, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌, హౌసింగ్‌శాఖకు 13 చొప్పున, తహసీల్దార్‌ కోనరావుపేట, తంగళ్లపల్లికి 11 చొప్పున, సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయానికి 8, ఎస్పీ ఆఫీస్‌, తహసీల్దార్‌ ముస్తాబాద్‌కు ఏడు చొప్పున.. మొత్తం 209 దరఖాస్తులు వచ్చాయి. సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్‌ జ్యువెల్లరీకి

అనుమతులు ఇవ్వొద్దు

చేతివృత్తులైన తమ ఉపాధికి విఘాతంగా మారకుండా కార్పొరేట్‌ జ్యువెల్లరీ షాపును ప్రారంభించకుండా చూడాలని ముస్తాబాద్‌ మండల స్వర్ణకారులు కోరారు. ఈమేరకు కలెక్టరేట్‌కు తరలివచ్చి వినతిపత్రం అందించి మాట్లాడారు. మండలంలో 80 మంది వరకు స్వర్ణకారులు కులవృత్తిని నమ్ముకున్నామని, కార్పొరేట్‌ జ్యు వెల్లరీతో ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ షాపును తెరవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడు చింతోజు బాలయ్య, వెంగలం శ్రీనివాస్‌, నవీన్‌, సతీశ్‌ పాల్గొన్నారు.

స్తంభంపల్లి వంతెన

పూర్తిచేయండి

పది నెలలుగా అసంపూర్తిగా ఉంటున్న స్తంభంపల్లి హైలెవల్‌ వంతెన పనులు పూర్తిచేయాలని బోయినపల్లి మండలం స్తంభంపల్లి, గుండన్నపల్లి, కోరెం, బూరుగుపల్లి, తడగొండ గ్రామస్తులు బైక్‌ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. రానున్న వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయకపోతే 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారని, వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ బిల్లు చెల్లించండి

నేను తంగళ్లపల్లి శివారులోని పద్మనగర్‌ సర్పంచ్‌గా పనిచేశాను. ఎండాకాలంలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సొంత డబ్బులతో సరఫరా చేశాను. వీటికి సంబంఽధించి రూ.1.20లక్షలు పెండింగ్‌లో ఉంది. కలెక్టర్‌, మిషన్‌ భగీరథ ఈఈకి పలుమార్లు విన్నవించాను. బిల్లులు చెల్లిస్తలేరు. ఇప్పటికై నా కలెక్టర్‌ స్పందించి బిల్లులు మంజూరు చేయాలి.

– పోచయ్య పద్మనగర్‌, మాజీ సర్పంచ్‌

అక్రమ అంతస్తులపై చర్యలు చేపట్టండి

టౌన్‌ప్లానింగ్‌ అధికారుల వైఫల్యంతో సిరిసిల్లలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. గాంధీచౌక్‌లో చేపడుతున్న ఓ షాపింగ్‌మాల్‌ నిర్మాణంలో యజమానులు సెట్‌బ్యాక్‌ పాటించడం లేదు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని నిలిపేసి యజమానిపై చర్యలు తీసుకోవాలి.

– ఎలిగేలి రాజశేఖర్‌, సిరిసిల్ల

డ్రెయినేజీ మరమ్మతు చేయించండి

కేసీఆర్‌నగర్‌లోని రోడ్డు నంబర్‌ 4లో డ్రెయినేజీ లీకేజీ అవుతోంది. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పాడైన సెప్టిక్‌ట్యాంకును బాగుచేయించాలి. మురుగునీరు కూడా డ్రెయినేజీకి సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. – కేసీఆర్‌నగర్‌ వాసులు

విన్నపాలు వినవలే..1
1/8

విన్నపాలు వినవలే..

విన్నపాలు వినవలే..2
2/8

విన్నపాలు వినవలే..

విన్నపాలు వినవలే..3
3/8

విన్నపాలు వినవలే..

విన్నపాలు వినవలే..4
4/8

విన్నపాలు వినవలే..

విన్నపాలు వినవలే..5
5/8

విన్నపాలు వినవలే..

విన్నపాలు వినవలే..6
6/8

విన్నపాలు వినవలే..

విన్నపాలు వినవలే..7
7/8

విన్నపాలు వినవలే..

విన్నపాలు వినవలే..8
8/8

విన్నపాలు వినవలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement