
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుదాం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాస్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని , ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి సాగును కట్టడి చేయాలన్నారు. బహిరంగంగా మద్యం సేవించకుండా నిరోధించాలని, పాన్షాపులు, సినిమా థియేటర్లు, బార్ల వద్ద నిఘా ఉంచాలని సూచించారు. బార్ నిర్వాహకులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి షాపులను ఎప్పుడు మూస్తున్నారో గమనించాలన్నారు. డ్రగ్స్ పరీక్షలు చేసే యూరిన్ కిట్లను పోలీసు, ఎకై ్సజ్ అధికారులు సమకూర్చుకోవాలని సూచించారు. ఎస్పీ మహేశ్ బి గితే మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణకు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన వాల్ పోస్టర్లను, హ్యాండ్బుక్లను ఆవిష్కరించారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష పాల్గొన్నారు.
సెలవుల్లో పిల్లలపై దృష్టి పెట్టండి
సిరిసిల్లక్రైం: విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో పిల్లలు ఆటలు, ఈత కొట్టడం వంటి వాటి కోసం ఆరుబయటకు వెళ్లే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు వారి కదలికలపై దృష్టి పెట్టాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాలమీదికి వస్తుందని పేర్కొన్నారు. పిల్లలు చెరువులు, కాల్వలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువకులు ఎండవేడి నుంచి సేదతీరేందుకు ఈత నేర్చుకునేందుకు చెరువులు, కాల్వల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని తెలిపారు. తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు ఈత నేర్చుకోవాలని సూచించారు.