
చెరువులో మునిగి ఒకరి మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): చేపలు పట్టేందుకు వెళ్లి.. వ్యక్తి చెరువులో గల్లంతవగా.. మరొకరు సురక్షితంగా బయటపడ్డ సంఘటన ముస్తాబాద్ మండలం కొండాపూర్లో చోటుచేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. కొండాపూర్కు చెందిన మహ్మద్ రషీద్(45), బాబా(30) గ్రామ శివారులోని పెద్ద చెరువులోకి చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. ఇద్దరు వలతో చెరువులోకి దిగారు. రషీద్ చెరువులో మునిగిపోయాడు. రషీద్ కోసం బాబా ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలోకి వెళ్లి విషయం తెలిపాడు. గ్రామస్తులు పెద్దచెరువులో రాత్రి ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం సిరిసిల్ల నుంచి గజఈతగాళ్లను రప్పించారు. వారు రషీద్ మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో భార్య షెహనాజ్, కూతురు రేష్మ, కుమారుడు రఫీ, బంధువుల రోదనలు మిన్నంటాయి. రషీద్ ఆరు నెలల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చా డు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కేసు న మోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపా రు. మూడేళ్ల క్రితం అదే చెరువులో చేపలు ప ట్టేందుకు వెళ్లి మహ్మద్ ఎక్రామ్ చనిపోయాడు.
కొనసాగుతున్న టాస్ పరీక్షలు
సిరిసిల్లఎడ్యుకేషన్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఇంటర్, పదోతరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 1,090 మందికి 987 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 41 మందికి 33 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు తెలిపారు.
దాడి ఘటనలో ముగ్గురిపై కేసు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్లో పాతకక్షలతో దాడి చేసిన ముగ్గురిపై సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. వెంకటాపూర్కు చెందిన మోతె కిరణ్, మోతె ఎల్లవ్వ, మోతె ఎల్లయ్యలపై ఆదివారం రాత్రి అదే గ్రా మానికి చెందిన మోతె సతీష్, మోతె ఎల్లవ్వ, మోతె బాలమణి బండరాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కిరణ్, ఎల్లయ్య, ఎల్లవ్వలకు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్ ఫిర్యాదుతో సతీష్, ఎల్లవ్వ, బాలమణిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి రిమాండ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తన పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయకుంటే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డ మండలంలోని వెంకటాపూర్కు చెందిన అల్లె రాజును రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. వెంకటాపూర్ మాజీ సర్పంచ్ కోల నర్సయ్య గ్రామ శివారులోని 928/బీ సర్వే నంబర్లో 1.04 ఎకరాలను అల్లె అన్వేశ్ వద్ద కొన్నాడు. గతంలో భార్యను, కూతురిని చంపి జైలుకు వెళ్లి 9 నెలల క్రితం అల్లె రాజు బయటకు వచ్చాడు. ఈనెల 18న ఆ భూమిలో కోల నర్సయ్య ట్రాక్టర్తో చదును చేయిస్తుండగా.. అల్లె రాజు వెళ్లి ఆ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈమేరకు కోల నర్సయ్య ఫిర్యాదుతో సోమవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వివరించారు.
ఇసుక తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
ఇల్లంతకుంట: పొత్తూరు బిక్కవాగు నుంచి ఇసుక తరలిస్తున్న వ్యక్తిని సోమవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్గౌడ్ తెలి పారు. డిప్యూటీ తహసీల్దార్ గతనెల 31న గస్తీ తిరుగుతుండగా పొత్తూరు బిక్కవాగులో అక్రమంగా ట్రాక్టర్లో ఇసుక తరలిస్తున్నాడు. వీరిని చూసి ట్రాక్టర్తో సహా ఆకుల తిరుపతి పారిపోయారని ఎస్సై తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. తిరుపతిని సోమవారం రిమాండ్కు తరలించి, ట్రాక్టర్ ఇంజిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.