
డిజిటల్ భవిష్యత్కు ఏఐ
గంభీరావుపేట(సిరిసిల్ల): డిజిటల్ భవిష్యత్ మొ త్తం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పైనే ఆధారపడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫిజికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై నేషనల్ సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలు రీసెర్చ్ సంస్థల ప్రొఫెసర్లు పాల్గొని పవర్ ప్రెజెంటేషన్లు, ప్యానల్ డిస్కషన్, పోస్టర్ ప్రజెంటేషన్ ద్వారా ఏఐ గురించి వివరించారు.
సెమినార్లో ఏం చెప్పారంటే..
డిజిటల్ భవిష్యత్కు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దోహదపడుతుందన్నారు. సాంకేతిక విప్లవాన్ని ముందుకు సాగించే క్రమంలో త్వరలోనే కృత్రిమ మేధ ప్రజలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సాధారణ పౌరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతూ వారి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్కిల్స్ను అభివృద్ధి చేసుకుంటూ విద్యార్థులు డిజిటల్ భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, రీసోర్స్ పర్సన్లు కల్యాణి, స్వాతి మాతూర్, హంట్ మెట్రిక్ సీఈవో అయూబ్ షేక్, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటర డాక్టర్ శ్రావణ్కుమార్, పరిశోధకులు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
త్వరలో అందరికీ అందుబాటులోకి ‘కృత్రిమ మేధ’
గంభీరావుపేట డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నేషనల్ సెమినార్
హాజరైన రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
ఆకట్టుకున్న ప్రొఫెసర్ల పవర్ ప్రెజెంటేషన్లు

డిజిటల్ భవిష్యత్కు ఏఐ