
21లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
సిరిసిల్ల: మధ్యమానేరు, అనంతగిరి ప్రాజెక్టులలో ముంపునకు గురైన నిర్వాసితులు ఈనెల 21లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా శుక్రవారం కోరారు. జిల్లాలో ముంపు గ్రామాలైన గుర్రంవానిపల్లి, చీర్లవంంచ, చింతలఠాణా, కొదురుపాక, రుద్రవరం, సంకెపల్లి, ఆరెపల్లి, అనుపురం, కొడిముంజ, వరదవెల్లి, శాభాష్పల్లి నిర్వాసితులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఊడిపడ్డ బస్సు అద్దం.. తప్పిన ప్రమాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు అద్దం ఊడిపోవడంతో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులకు, వెనకాల వస్తున్న వాహనదారులకు ప్రమాదం జరుగకపోవడంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి కామారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు వెనకాల ఉన్న అద్దం ఊడిపోయి బస్సు నడుస్తున్న సమయంలోనే కిందపడింది. ఆ సమయంలో బస్సు వెనకాల ఇతర వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు వరుసగా జరుగుతుండడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల మెయింటనెన్స్ సరిగ్గా చేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు శుక్రవారం బీఆర్ఎస్ నేతలు క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్లలో వస్త్రపరిశ్రమను ఆదుకోవాలని, నేతన్నలకు ఉపాధి కల్పించాలని సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేశారన్నారు. ఇందులో భాగంగా మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో టెక్స్టైల్ పరిశ్రమలను స్థాపించాలన్న ముందుచూపుతోనే అపెరల్ పార్కు ఏర్పాటైందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోనే టెక్స్పోర్టు కంపెనీతో ఒప్పందం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అర్బన్బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత పాలిసెట్ శిక్షణ ప్రారంభం
సిరిసిల్లటౌన్: పాలిసెట్ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సిరిసిల్ల పోపా ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత శిక్షణను ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణకు 130 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. సిరిసిల్ల పోపా ఉపాధ్యక్షుడు మామిడాల భూపతి, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి ఎర్రం శ్రీని వాస్, సిరిసిల్ల ఎంఈవో దూస రఘుపతి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్, సభ్యులు మచ్చ ఆనంద్, అంకారపు జ్ఞానోబా, రవీందర్, ఆడెపు వేణు, ప్రభాకర్ పాల్గొన్నారు.
రక్తదాత హాఫ్ సెంచరీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 సార్లు రక్తం దానం చేశాడు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్రెడ్డి. సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరికి బ్లడ్ అత్యవసరమని ఫోన్కాల్ రావడంతో వెంటనే జిల్లా బ్లడ్బ్యాంక్కు వెళ్లి 50వ సారి రక్తదానం చేశాడు. గతంలో చిరంజీవి బ్లడ్బ్యాంక్లో 40 సార్లు డొనేట్ చేసినట్లు తెలిపా రు. పలువురు అభినందించారు.

21లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి

21లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి

21లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి