మాటపై నిలబడే దమ్ముంటే రుణమాఫీ చేయాలి: షర్మిల | Ys Sharmila's comment Cm KCR | Sakshi
Sakshi News home page

మాటపై నిలబడే దమ్ముంటే రుణమాఫీ చేయాలి: షర్మిల

Jul 18 2023 6:09 AM | Updated on Jul 18 2023 9:44 AM

Ys Sharmila's comment Cm KCR  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు మాట మీద నిలబడే దమ్ముంటే తక్షణం 31 లక్షల మంది రైతులకు రూ. లక్షలోపు రుణాలు మాఫీ చేయాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ‘మాట ఇస్తే తల నరుక్కుంటం’ అంటూ రుణమాఫీపై చేసిన వాగ్దానాలు గడప దాటలేదని, రైతులకు రుణమాఫీ కాలేదని ఆమె ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

కేసీఆర్‌ బూటకపు హామీని నమ్మి ఓటేసిన పాపానికి రైతన్నలు బ్యాంకుల దగ్గర దోషిలా నిలబడ్డారని విచారం వ్యక్తం చేశారు. రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతుల ఇళ్ల మీద పడుతున్నా, రైతుబంధు పైసలను వడ్డీల కింద జమ చేసుకుంటున్నా కేసీఆర్‌కు కనీసం చీమ కుట్టినట్టైనా లేదన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement