
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు చేవెళ్ల లోక్సభ పరిధిలో పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి మద్దతుగా వికారాబాద్లో, నాగర్కర్నూల్ పార్లమెంట్ ప రిధిలో అభ్యర్థి భరత్ ప్రసాద్కు మద్దతుగా వనపర్తిలో బహిరంగ సభల్లో పాల్గొననున్నా రు.
సాయంత్రం 6 గంటలకు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం తరఫున అమిత్షా చివరి ప్రచారసభల్లో ప్రసంగించనున్నారు.