
విద్యార్థులకు జీఎం అభినందన
గోదావరిఖని: పదోతరగతి పరీక్షల్లో సింగరేణి పాఠశాల విద్యార్థులు సత్తా చాటడంతో ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్ అభినందించారు. సెక్టార్–2 స్కూల్కు చెంది న విద్యార్థి అస్మిత అత్యధికంగా 559 మార్కులు సాధించింది. మొత్తం 59మంది విద్యార్థులు పరీక్ష రాయగా 52 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 8 మంది 500లకుపైగా మార్కులు సాధించి సత్తా చాటారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మంచి మార్కులు సాధించి సింగరేణి ఎ డ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పా ఠశాలలన్నింటిలోనూ సెక్టార్ –2 పాఠశాల ఉత్తమంగా నిలిచింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని అస్మితను జీఎం లలిత్కుమార్ అభినందించారు. అదేవిధంగా పాఠశాల కరస్పాడెంట్ కిరణ్బాబు, ఇన్చార్జి హెచ్ఎం స్వర్ణలత తదితరులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

విద్యార్థులకు జీఎం అభినందన