
జీవాలకు మేత లేకుండాపోతోంది
ఎనుకట పశువులు, జీవాలు (మేకలు, గొర్లు)మేసేందుకు ఆకు ఆలం, గడ్డి పుష్కలంగా ఉండేది. నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు ఇప్పటికీ అక్కడక్కడ తిరుగుతున్నాయి. గుట్టలు తవ్వి మట్టి తీసుకుపోతుండటంతో కనపడకుండా పోయాయి. గుట్టలు ఉంటే వానలు కూడా పడతాయని ఎనుకటోళ్లు చెప్పేటోళ్లు. సర్కారు చర్యలు తీసుకుని గుట్టలను కాపాడాలి.
– తిప్పనవేన కొమురయ్య,
కాల్వశ్రీరాంపూర్
నోటీసులు ఇచ్చాం
పాండవుల గుట్ట ఆక్రమణకు గురువుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. కొందరికి నోటీసులు ఇచ్చాం. ఆక్రమణకు పాల్పడినా, మట్టిని తరలించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు పెట్టాం. ఇటీవల పందిల్ల బోళ్ల గుట్ట ఆక్రమించారని ఫిర్యాదు రావడంతో చర్యలు తీసుకున్నాం.
– జగదీశ్వర్రావు,
తహసీల్దార్, కాల్వశ్రీరాంపూర్

జీవాలకు మేత లేకుండాపోతోంది