స్ఫూర్తికి అభినందన | - | Sakshi
Sakshi News home page

స్ఫూర్తికి అభినందన

Apr 24 2025 12:17 AM | Updated on Apr 24 2025 12:17 AM

స్ఫూర

స్ఫూర్తికి అభినందన

గోదావరిఖనిటౌన్‌: స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని కన్నాపురం స్ఫూర్తి ఇంటర్‌ హెచ్‌ఈసీలో 1000 మార్కు లకు 978 మార్కులు సాధించడంతో అధికారులు అభినందించారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఇంటర్‌ విద్య జిల్లా నోడల్‌ అధికారి కల్పన, అడిషనల్‌ కలెక్టర్‌ వేణు శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. విద్యార్థిని తండ్రి నాగేందర్‌, అధ్యాపకులు సంపత్‌, నరేశ్‌, శంకర్‌ పాల్గొన్నారు.

కర్రిగుట్టలో కూంబింగ్‌ ఆపండి

పెద్దపల్లిరూరల్‌: కర్రిగుట్టలో సాయుధ పోలీసు బలగాలు చేపట్టిన కూంబింగ్‌ను ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం నాయకులు మాదన కుమారస్వామి, రాజగోపాల్‌, సుచరిత కేంద్రప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలపై అణచివేతను ఆపాలన్నారు. మావోయిస్టు ఉద్యమకారులను హతమార్చడాన్ని నిలిపివేయాలని వారు కోరారు. సమావేశంలో నాయకులు పర్వతాలు, సత్యనారాయణ, విశ్వ నాథ్‌, బాలసాని రాజయ్య, గాండ్ల మల్లేశం, మార్వాడి సుదర్శన్‌, బాపు, మల్లయ్య, సదా నందం, రాజమల్లయ్య, రత్నకుమార్‌, రవీందర్‌, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ అబ్జర్వర్ల నియామకం

సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పీసీసీ అబ్జర్వర్లగా సయ్యద్‌ అజ్మాతుల్లా హుస్సేనీ, సంగీ తం శ్రీనివాస్‌ను పీసీసీ నియమించింది. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆమోదంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అబ్జర్వర్లను ప్రకటించారు. వీరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయేందుకు పనిచేయనున్నారు. పార్టీ కార్యకర్తలను కలుసుకొని పార్టీ పరిస్థితిపై ఆరా తీయనున్నారు. త్వరలో ప్రకటించబోయే డీసీసీ, మండల, బ్లాక్‌ అధ్యక్షుల నియామకం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి పీసీసీకి నివేదించనున్నారు. ఆయా నివేదికల ఆధారంగా నేతలకు కాంగ్రెస్‌ పార్టీ లో పదవులు వరించనున్నాయి.

5న టాలెంట్‌ టెస్ట్‌

పెద్దపల్లిరూరల్‌: అనాథ విద్యార్థులకు ఉచిత వి ద్య అందించేందుకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మే 5న పీపీటీ (పీపుల్స్‌ ప్రోగ్రెసివ్‌ ట్రస్ట్‌) టా లెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా బాధ్యులు కుమారస్వామి, లక్ష్మణ్‌ తెలిపారు. టెస్ట్‌లో ప్రతి భ చూపిన విద్యార్థులకు హైదరాబాద్‌లోని పా ఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో ఉచిత విద్య అందిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 4, 5, 6వ తరగతుల్లో ప్రవేశానికి టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 94385 81045, 98854 46299 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.

ఓపెన్‌ తరగతులు ప్రారంభం

పెద్దపల్లిరూరల్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌ తరగతులు ఈ నెల 20న ప్రారంభించామని ప్రిన్సిపాల్‌ లక్ష్మీనర్సయ్య తెలిపారు. అడ్మిషన్‌ పొందిన వారు తరగతులకు హాజరు కావాలని కో ఆర్డినేటర్‌ షుకూర్‌ కోరారు.

లివర్‌ సిరోసిస్‌ బాధితులకు ప్రత్యేక సెలవు

గోదావరిఖని: తీవ్ర కాలేయ జబ్బు(లివర్‌సిరోసిస్‌) బారినపడిన సింగరేణి కార్మికులకు సగం జీతంతోపాటు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ యాజమాన్యం బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు ఏడు దీర్ఘకాలిక వ్యాధుల కు మాత్రమే సెలవు వర్తింపచేస్తున్నారు. గుండెజబ్బు, క్షయ, క్యాన్సర్‌, కుష్ఠు, పక్షవాతం, మూత్రకోశవ్యాధులు, ఎయిడ్స్‌, మెదడు సంబంధిత వ్యాధులుకు ప్రత్యేక సెలవు ఇస్తున్నారు. ఇటీవల కోల్‌ ఇండియా స్థాయిలో జరిగిన ఎన్‌సీడబ్ల్యూఏ 11వ వేతన ఒప్పందంలో లివర్‌ సిరోసిస్‌ (తీవ్ర కాలేయ వ్యాధి) బాధితులకు కూడా స్పెషల్‌ లీవ్‌ వర్తింపచేయాలని నిర్ణయించడంతో సింగరేణి యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తీవ్ర కాలేయ వ్యాధికి గురైన కార్మికునికి స్పెషల్‌ లీవు మంజూరు చేయవచ్చని, వ్యాధి నయమై, విధులకు ఫిట్‌ అయ్యేంతవరకూ ఉద్యోగికి 50 శాతం వేతన మొత్తం (బేసిక్‌ పే, వీడీఏ, ఎస్‌డీఏలో 50 శాతం) చెల్లించవచ్చని ఆ ఉత్తర్వులో సింగరేణి వివరించింది.

స్ఫూర్తికి అభినందన 1
1/1

స్ఫూర్తికి అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement