
ప్రైవేట్కు అప్పగించొద్దు
గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రైవేట్కు అప్పగి స్తే ఊరుకునేదిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షు డు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. నగరంలోని ప్రధాన వీధుల్లో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సింగరేణిని ప్రైవేట్కు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని, యువ కార్మికులు సైనికుల్లాగా కదిలివచ్చి సంస్థను కాపాడుకోవాలని కోరారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు కొరిమి రాజ్కుమార్, ఆరెల్లి పోశం, ఎ ల్.ప్రకాశ్, మడ్డి ఎల్లాగౌడ్, వైవీ రావు, వీరభద్రం, స్వామి, రాజరత్నం, రాంచందర్ పాల్గొన్నారు.
కాలనీలో ఘనస్వాగతం
యైయెటింక్లయిన్కాలనీ: అంతకుముందు సాంబశివరావుకు యైటింక్లయిన్కాలనీలో ఆర్జీ–2 బ్రాంచ్ నాయకులు ఘనస్వాగతం పలికారు. నాయకులు ప్రకాశ్, రాజారత్నం, రవీందర్, తిరుపతి, రవికుమార్, మహేందర్, నారాయణ, రమేశ్ ఉన్నారు.