పోలింగ్‌ కేంద్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

May 8 2024 1:10 AM | Updated on May 8 2024 1:10 AM

పోలిం

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్‌పూర్‌, ఎలిగేడులో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత మంగళవారం పర్యటించారు. పార్లమెంట్‌ ఎన్నికల కో సం ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. వసతులపై ఆరా తీశారు. తాగునీ టి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించా రు. ఎంపీడీవో భాస్కర్‌రావు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు చేయండి

ఎలిగేడు(పెద్దపల్లి): ఆయిల్‌పామ్‌ సాగుకు రై తులు ముందుకు రావాలని ఉద్యానవనశాఖ అధికారి జ్యోతి కోరారు. ముప్పిరితోటలో పెద్దపల్లి ఉద్యానవనశాఖ, రివులిస్‌ కంపెనీ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించారు. ఆయిల్‌పా మ్‌ సాగుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నా రు. త్వరలోనే పెద్దరాతిపల్లిలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పరివ్రమ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఏఈవో పద్మ, ఫీల్డ్‌ఆఫీసర్‌ అభిలాష, రివులిస్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రతినిధి రహమాన్‌, కో ఆర్టినేటర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎల్లంపల్లిలో 6.10టీఎంసీలు

రామగుండం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు. నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం 141 మీటర్లు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 6.10 టీఎంసీలకు పడిపోయింది.

చిన్నారుల విహారయాత్ర

రామగుండం: స్థానిక తబితా ఆశ్రమంలోని చి న్నారులు వేసవి ఆటవిడుపు కోసం మంగళవా రం హైదరాబాద్‌లోని వండర్‌లా సందర్శనకు బయలుదేరి వెళ్లారు. కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ తన సొంత నిధులు వెచ్చించడంతో చిన్నారు మానసిక ఆనందం కోసం వివాహర యాత్రకు తీసుకెళ్తున్నామని ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్‌నాయక్‌ ఈ సందర్భంగా తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన1
1/1

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement