గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. మండలంలోని నందివానివలసలో తామరచెరువు, పంటపొలాల్లో సంచరించిన ఏనుగులు సోమవారం సుంకి గ్రామ పరిసరాల్లోని నాగావళినది ప్రాంతంలో గల పంప్హౌస్ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. కొద్ది రోజులనుంచి ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏ గ్రామంలో చొరబడి ఎవరికి హాని కలగజేస్తాయోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి పంటలు ఉండడంతో రైతులు పొలం పనులు చేపట్టేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


