
తైక్వాండో ఓవరాల్ చాంప్ మదర్ థెరిసా క్లబ్
విజయనగరం: జిల్లాస్థాయిలో జరిగిన తైక్వాండో బాల, బాలికల పోటీల్లో విజయనగరానికి చెందిన మదర్ థెరిసా క్లబ్ జట్టు సత్తా చాటింది. గత నెల 31న బొబ్బిలి వేదికగా జరిగిన పోటీల్లో పాల్గొన్న జట్టులోని 27 మంది క్రీడాకారులు బంగారు పతకాలు కై వసం చేసుకోవడంతో పాటు ఓవరాల్ చాంపియన్షిప్ను దక్కించుకున్నారు. అంతేకాకుండా ఈనెల 9,10,11 తేదీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరగనున్న రాష్ట్రస్థాయి బాల, బాలికల తైక్వాండో పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా నిలవడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న మదర్ థెరిసా క్లబ్ క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావులు అభినందించారు.