రూ.32.84 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.32.84 కోట్లు

Jun 1 2025 1:02 AM | Updated on Jun 1 2025 1:02 AM

 రూ.3

రూ.32.84 కోట్లు

రూ.700 కోట్లు
రూ.196.236 కోట్లు

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో అధికమందికి వ్యవసాయమే జీవనాధారం. ప్రధానంగా ఖరీఫ్‌ సీజన్‌పైనే రైతులు ఆధారపడతారు. సీజన్‌ ఆరంభంలో విత్తనాల కొనుగోలు, నారుమడుల తయారీకి పెట్టుబడులు అవసరమవుతాయి. రైతు ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ పథకం కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అందించింది. ఏటా ఖరీఫ్‌ పంట వేసే ముందు మే, జూన్‌ నెలలో రూ.7,500, రెండో విడతగా అక్టోబరులో ఖరీఫ్‌ పంట కోతకై నా, రబీ అవసరాలకై నా ఉపయోగపడేలా రూ.4 వేలు, మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ రూ.2 వేలు చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించేవి. జిల్లాలో ఏడాదికి సగటున 1.45 లక్షల మంది రైతులు సుమారు రూ.196.236 కోట్ల మేర లబ్ధి పొందారు. గత ఎన్నికలకు ముందు ఏటా పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామని ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇప్పటికి తనవంతుగా పైసా కూడా విదల్చలేదు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ కింద గత గతేడాది జూన్‌లో రూ.22.77 కోట్లు, అక్టోబరులో రూ.22.85 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఖరీఫ్‌ సీజన్‌ మొదలవ్వబోతోంది. రైతుకు ప్రభుత్వం నుంచి భరోసా అయితే దక్కలేదు.

సాగునీటికీ కష్టాలు..

రైతాంగానికి సాగునీటి కష్టాలు తీర్చాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రాజెక్టుల ఆధునికీకరణను గాలికొదిలేసింది. బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు చేసి చేతులు దులుపుకొంది. ప్రధాన సాగునీటి వనరైన తోటపల్లి ఆధునికీకరణ పనులు జాప్యం వల్ల గత ఖరీఫ్‌లో శివారు ప్రాంత రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారీ సాగునీరు అందుతున్న నమ్మకం రైతుకు లేదు. ఇటీవల పాలకొండలో రైతులు ధర్నాలు చేపట్టారు. తోటపల్లి మొత్తం పెండింగ్‌ పనులకు దాదాపు రూ.700 కోట్లు అవసరం కాగా.. 2024–25 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.32.84 కోట్లను మాత్రమే విదిల్చింది. జిల్లాలోని వెంగళరాయ, వట్టిగెడ్డ, పెదంకలాం, జంఝావతి తదితర ప్రధాన ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలను పెంచబోమని చెప్పిన చంద్రబాబు.. వరుస వడ్డనతో ప్రజలపై భారం మోపారు. విద్యుత్తు చార్జీల భారం వల్ల రైతులూ ఆందోళన చెందుతున్నారు.

నాడు క్రమం తప్పకుండా సున్నా వడ్డీ

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అర్హులైన రైతులకు క్రమం తప్పకుండా సున్నా వడ్డీ అందజేశారు. రూ.లక్షలోపు రుణాలు తీసుకుని గడువులోగా సక్రమంగా చెల్లించిన వారికి సున్నా వడ్డీ మొత్తాన్ని జమ చేసి, రైతులకు అండగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిలిచింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందేది. 2023 ఖరీఫ్‌ సీజన్‌లో ఏర్పడిన కరవుతోపాటు.. 2023–24 రబీ సీజన్‌ ఆరంభంలో మిచాంగ్‌ తుపానుతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఒక్క బటన్‌ నొక్కడం ద్వారా రూ.14.755 లక్షలు అందుకున్నారు. ఇలా ఏటా పంట నష్టపోయిన రైతుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఒక భరోసా లభించేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. రైతుకు సాయమేదీ అందడం లేదు. ఇటీవల అకాల వర్షాలకు రైతులు అరటి, నువ్వులు, మామిడి, జీడి తదితర పంటలను నష్టపోయినా.. నిబంధనల కొర్రీతో ఒక్క ఎకరాకూ పరిహారం దక్కలేదు.

ఖరీఫ్‌ పంటల సాగుకు దుక్కిచేస్తున్న రైతు

కూటమి ప్రభుత్వం 2024–25

బడ్జెట్‌లో

కేటాయించిన మొత్తం

గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో వైఎస్సార్‌ భరోసా కింద ఏడాదికి లబ్ధిపొందే రైతులు (సుమారుగా)

1.45 లక్షల మంది

కూటమి ప్రభుత్వం

అన్నదాత సుఖీభవ కింద రైతుకు అందజేసిన పెట్టుబడి సాయం

తోటపల్లి మొత్తం పెండింగ్‌ పనులకు అవసరమైన మొత్తం దాదాపు

0

వెన్నుపోటు దినం వాల్‌ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జెడ్పీచైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, నాయకులు

మెరకముడిదాం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా జిల్లాలో చేసిన అభివృద్ధి, సంక్షేమం శూన్యమని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమ పోస్టర్లను మెరకముడిదాంలో స్థానిక నాయకులతో కలిసి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నాయకుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్‌బుక్‌ రాజ్యంగంలో భాగంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. ఏడాది కాలంలో లక్షా 50 వేల కోట్లు అప్పు చేసినప్పటికీ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం, అభివృద్ధి పని చేపట్టలేదని, అప్పుచేసిన డబ్బులు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. రైతుల పంటల సాగుకు భరోసా లేదు, చదువుతున్న చిన్నారులకు తల్లికి వందనం లేదు.. మహిళలకు ఉచిత బస్సును సైతం తుస్సుమనిపించారని విమర్శించారు. ఒక్కపథకమూ అమలుచేయలేక, ప్రజలకు మోహాలు చూపించలేక నియోజకవర్గాల్లో కూటమి నేతలు తిరగడం మానేశారన్నారు. ప్రజల కష్టాలను గాలికి వదిలేశారని, కనీసం సమావేశాలకు కూడా రాకుండా మోహంచాటేస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పేదల పిల్లల విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చిందని, నాడు–నేడు పనులతో పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన కింద ఆర్థిక సాయం అందించిందన్నారు. నేడు పనులు చేసినా బిల్లులు అందడం లేదంటూ కూటమికి చెందిన నాయకులే గగ్గోలు పెడుతున్నారన్నారు. పదోతరగతి ఫలితాల ప్రకటనలో వైఫల్యానికి విద్యాశాఖ మంత్రి లోకేశే కారణమన్నారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసిన ఫెయిలైన 11వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారంటే పరీక్ష పత్రాల మూల్యాంకనంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌, బూర్లె నరేష్‌కుమార్‌, పప్పల కృష్ణమూర్తి, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బోనెల గోపి, సత్తారు శ్రీనివాసరావు, టి.వర్మరాజు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

‘మద్దతు’ కంటితుడుపు!

గత ఏడాది కాలంలో రైతులకు ప్రభుత్వం నుంచి ‘మద్దతు’ లభించడం లేదు. గత ఖరీఫ్‌ సీజన్‌లో సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు దళారులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ రకం క్వింటా మద్దతు ధర ప్రభుత్వం రూ.2,300 ప్రకటించగా.. రైతులు రూ.1,600 నుంచి రూ.1,800 చొప్పున మధ్యవర్తులకు విక్రయించుకున్నారు. దీనికితోడు అదనంగా కిలోలను దళారులు లెక్కగట్టి తీసుకున్న సందర్భాలున్నాయి. మొక్కజొన్న, జీడి రైతులదీ అదే పరిస్థితి. మన్యం జిల్లాలో గత సీజన్‌లో 14,800 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. పంట కొనుగోలులో సీసీఐ తీవ్ర నిర్లక్ష్యం చూపింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ముచ్చర్లవలసలోని పత్తి జిన్నింగ్‌ మిల్లు వద్ద కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలోని పత్తి పండించిన ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫలితంగా రైతులు గ్రామాల్లోకి వచ్చిన దళారులనే ఆశ్రయించారు. క్వింటా పత్తి మద్దతు ధర రూ.7,100 నుంచి రూ.7,500 వరకు ఉంటే.. వ్యాపారులు రైతుల వద్ద రూ.6,100కే కొనుగోలు చేశారు. క్వింటా వద్ద రూ.వెయ్యి వరకు రైతు నష్టపోయారు. జిల్లాలో భామిని, పాలకొండ, సీతంపేట ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి సాగులో ఉంది. రైతులను ఆదుకుంటామని అధికారులు చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.

ఆర్థిక లబ్ధి (ఏడాదికి)

జెడ్పీచైర్మన్‌ మజ్జిశ్రీనివాసరావు ధ్వజం

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది

ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం తప్ప ప్రజలకు చేసినదేమీ లేదు

సూపర్‌సిక్స్‌ హామీలను గాలికి వదిలేశారు

ఏడాదిలో లక్షా 50 వేల కోట్లు అప్పుచేసినా పథకాలు అందజేయని వైనం

జూన్‌ 4న ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ నిర్వహణ

 రూ.32.84 కోట్లు 1
1/4

రూ.32.84 కోట్లు

 రూ.32.84 కోట్లు 2
2/4

రూ.32.84 కోట్లు

 రూ.32.84 కోట్లు 3
3/4

రూ.32.84 కోట్లు

 రూ.32.84 కోట్లు 4
4/4

రూ.32.84 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement