
పదోన్నతి నియామక పత్రాల అందజేత
విజయనగరం: జిల్లా పరిషత్ పరిధిలోని వివిద ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పదోన్నతి నియామక పత్రాలు అందజేశారు. పార్వతీపురం సబ్డివిజన్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వై.దేవానంద్ను డెంకాడ మండ ల పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నియమించారు. అలాగే జామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న జి.లీలావతికి భైరిపురం జిల్లా పరిషత్ పాఠశాల జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతి క ల్పించారు. ఈ మేరకు ఆ ఇద్దరు ఉద్యోగులకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తన చాంబర్లో నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీవీవీ.సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ ఆర్.వెంకట్రామన్లు పాల్గొన్నారు.
క్రీడలతోనే మంచి సమాజం
● కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు
విజయనగరం: క్రీడలతోనే మంచి సమాజ స్థాపన సాధ్యమవుతుందని కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు అన్నారు. ఈ మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక విజ్జి మైదానంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాడ్మింటన్, బాక్సింగ్, హ్యాండ్బాల్, తైక్వాండో క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుని రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఎస్డీఓ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడం కోసం,విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించాలని వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు, వివిధ క్రీడా సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
సాలూరు రూరల్: మండలంలోని కందులపధం గ్రామంలో గురువారం పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆ ప్రాంతానికి చేరుకుని పేకాటరాయుళ్లను పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితులతో పాటు 3 మోటార్సైకిల్స్, రూ.26,190 నగదు సీజ్ చేశామన్నారు.
భూ ఆక్రమణలపై జోక్యం చేసుకోవాలి
● ఎస్టీ కమిషన్ చైర్మన్కు గిరిజనుల వినతి
విజయనగరం అర్బన్: అనంతగిరి మండలం బీంపోలు పంచాయతీ సరియాపల్లి గ్రామ ప్రజల భూఆక్రమణలపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఆ గ్రామస్తులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావును కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు.తమ భూమి గిరిజనేతరుల ఆక్రమణకు గురైందని వాపోయారు. దీనిపై స్పందించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమిషన్ చైర్మన్ను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ ఎం.అప్పలకొండ, ఎంపీటీసీ అశోక్, సతీష్ తదితరులు ఉన్నారు.
వ్యక్తి అదృశ్యం
వంగర: మండల పరిధి ఎం.సీతారాంపురం గ్రామానికి చెందిన సాకేటి లక్ష్మణరావు (47) అదృశ్యమైనట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. వంగరలో హెచ్పీ గ్యాస్ ఆఫీస్లో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న లక్ష్మణరావు మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు ఆయన భార్య సాకేటి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

పదోన్నతి నియామక పత్రాల అందజేత

పదోన్నతి నియామక పత్రాల అందజేత

పదోన్నతి నియామక పత్రాల అందజేత