
పాలకొండలో నీచ రాజకీయం!
పాలకొండ:
పాలకొండ పంచాయతీ కార్యాలయం సాక్షిగా కూటమి నాయకులు విలువలకు తిలోదకాలిచ్చి, నీచరాజకీయాలకు తెరతీస్తూ సోమవారం నిర్వహించిన చైర్పర్సన్ ఎన్నికలోరాజకీయ నాటకాన్ని రక్తి కట్టించారు. దీనిని చూసిన జనం విస్తుపోయా రు. సంఖ్యాబలం లేకుండా.. వైఎస్సార్సీపీ బీఫా రంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి చైర్పర్సన్గా ఎన్నికై న ఆకుల మల్లీశ్వరికి టీడీపీ కండువాలు కప్పి తమ పార్టీయే అంటూ హంగామా చేయడాన్ని చూసిన జనం నవ్వుకున్నారు. కూటమి నాయకులు చేసిన పలు మంత్రాలు, తంత్రాలు, నా టకాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ లెక్క..
పాలకొండ నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా వైఎస్సార్సీపీ నుంచి 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. టీడీపీకి ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. నగరపంచాయతీ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో 19వ వార్డు కౌన్సిలర్ యందవ రాధాకుమారిని అప్పటి వైఎస్సార్ కౌన్సిలర్లు చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. ఆరు నెలల కిందట రాధాకుమారి వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేశారు. దీంతో వైస్ చైర్మన్–2గా ఉన్న పల్లా ప్రతాప్కు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. చైర్పర్సన్ ఎన్నికకు మూడునెలల కిందట నోటిఫికేషన్ విడుద ల కావడంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒకే ఒక్క సభ్యురాలు ఆకుల మల్లీశ్వరిని చైర్పర్సన్గా ఎన్నుకోవడం తప్పనిసరైంది. వైఎస్సార్సీపీకి సభ్యుల బలం ఉండడంతో పాటు, ఆకుల మల్లీశ్వరి కూడా వైఎస్సార్సీపీకి చెందినవారే కావడంతో చైర్పర్సన్ ఎన్నిక లాంచనే అనున్నారు. ఇంతలో ఆమెను టీడీపీలో చేర్చుకుని, చైర్పర్సన్ పదవి కూటమిదేనని చెప్పకునేందుకు నాయకులు ప్రలోభాలకు తెరతీశారు. కౌన్సిలర్లపై ఒత్తిడి పెంచారు. ఏకంగా జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లాకు చెందిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సైతం ఇందులో పాత్రదారులయ్యారు. సాంకేతికంగా మల్లీశ్వరి వైఎస్సార్సీపీ అభ్యర్థికావడం, పార్టీ నుంచి ఎన్నికకు బీ–ఫారం అందించడంతో కూట మి ఎత్తులు పారలేదు. మూడు మార్లు ఎన్నిక వాయిదా పడింది.
నిబంధనలు మార్పు చేసి....
కూటమి అధికార బలంతో చివరకు ఎన్నిక పూర్తి చేశారు. నిబంధనలు మార్పు చేసి సభ్యుల ప్రమే యం లేకుండా నేరుగా మల్లీశ్వరిని చైర్మన్గా ఎన్నిక చేసేందుకు తమ అధికార బలం ఉపయోగించారు. ఎన్నికల అధికారిగా ఉన్న సబ్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డిని తప్పించి ఎన్నికల అధికారిగా జేసీ శోభికను నియమించారు. ఉదయం 11 గంటలకు ఎన్నికల గదిలో ఆకుల మల్లీశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. దీనికి టీడీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కొత్తగా మార్చిన ముగ్గురు సభ్యుల మద్దతు ఉంటే చాలన్న నిబంధన మేరకు ఆకుల మల్లీశ్వరి చైర్పర్సన్గా ఎన్నికై నట్టు జేసీ ప్రకటించారు. ఎన్నికల కేంద్రం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమెకు టీడీపీ కండువాలను వేసి పదవి తమకే వచ్చిందంటూ కూటమి నాయకులు ప్రకటించారు. దీనికోసం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కిడారి శ్రవణ్ల ఉదయం నుంచి ఎన్నికల కార్యాలయం వద్ద మంతనాలు జరపడం గమనార్హం. చైర్పర్సన్ ఎన్నికలో వైఎస్సార్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు దూరంగా ఉండగా, కేవలం ఐదుగురు సభ్యులతో ఎన్నిక పూర్తి చేశారు. ఎన్నికల అనంతరం జేసీ శోభికతో విలేకరులు మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె అక్కడ నుంచి మాట్లాడకుండా వెళ్లిపోయారు.
నగర పంచాయతీ చైర్పర్సన్గా ఆకుల మల్లీశ్వరి ఎన్నిక వైఎస్సార్సీపీ బీ ఫారంతో నామినేషన్ దాఖలు
స్వతంత్ర అభ్యర్థిగా ఉంటానంటూ ప్రకటన
నిబంధనలు మార్పుతో కోరం లేకుండా ఎన్నిక పూర్తి
చైర్పర్సన్ అభ్యర్థి తమ పార్టీయే అంటూ కండువాలు కప్పిన టీడీపీ నాయకులు
విస్తుపోయిన జనం