
పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సా
●పిడుగు పడి వ్యక్తి మృతి
భామిని: భామిని మండలం ఘనసరకు చెందిన పాలపర్తి సిమ్మన్న(62) సోమవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కొత్తగూడ నుంచి మాసగూడకు వంశధార గట్టుమీదుగా వస్తుండగా పిడుగు పడడంతో దుర్మరణం చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
●పాచిపెంటలో వడగళ్ల వాన
పాచిపెంట: మండలంలోని గొట్టూరు పంచాయతీ కన్నయ్యవలస సమీప గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారి చల్లబడడంతో వేసవి తాపం నుంచి కొంత ఉపశమనం లభించిందని స్థానికులు పేర్కొన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సా

పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సా