
చెరువుల పరిరక్షణే ప్రధానం
పార్వతీపురంటౌన్: జిల్లాలోని చెరువులు ఆక్రమణకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ నిధులతో చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్, సర్వే అధికారులు సంయుక్తంగా చెరువుల సరిహద్దులు గుర్తించాలని స్పష్టం చేశారు. చెరువులు, చెక్డ్యాం పనులు మంగళవారం నుంచి ప్రారంభించారు. జిల్లాలో వీలైనన్ని నీటి కుంటలు నిర్మించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి వి. వీర్రాజు, జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్పాల్, పశుసంవర్థక శాఖాధికారి ఎస్.మన్మథరావు, ఉద్యానశాఖాధికారి శ్యామల, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.