ఆ‘ధర’ణ కరువు ...
చంద్రబాబు ప్రభుత్వం మార్చి 16 నుంచి 25 వరకు రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించింది. మొక్కజొన్నలకు ధర పడిపోయిందని, వెంటనే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్ని గ్రామాల్లో రైతులు కోరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రైతులు ఎంత మొత్తుకున్నా సర్కారు చేతులెత్తేసింది. ఆ దిశగా కనీసం ఎలాంటి చర్యలు లేవు. 2025–26 రబీలో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ మొక్కజొన్న సాగైంది. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పట్ల సర్వత్రా ఆందోళన వెల్లువెత్తుతోంది.తెలంగాణలో 2025–26 ఖరీఫ్ సీజన్తోపాటు రబీ సీజన్లో పండించిన మొక్కజొన్నలను అక్కడి ప్రభుత్వం మద్దతు ధర రూ. 2,400 ప్రకారం కొనుగోలు చేసింది. పొరుగు రాష్ట్రంలో కొనుగోలు చేస్తుంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం రైతులను కష్టాల్లోకి నెట్టింది. ఆదుకోవాలని అన్ని ప్రాంతాల్లోని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నా పట్టించుకోవడం లేదు.
జిల్లాలో
మొక్కజొన్న సాగు
వివరాలు
‘మొక్కజొన్న’లోనూ
చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో దోచుకుంటున్న దళారులు
ఆరుగాలం శ్రమించే రైతులు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్నారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు. రబీ సీజన్లో మొక్కజొన్న సాగు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొనుగోలు కేంద్రాల జాడ లేక దళారులు దోచుకుంటున్నారు. తక్కువ ధరలకు విక్రయించలేక కొందరు కల్లాల్లోనే ఆరబెట్టి ప్రభుత్వం ఏదో ఒక రోజు కొనుగోలు చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
రబీలో సాధారణ సాగు : 27,065 ఎకరాలు
రైతుకు
కలుగుతున్న నష్టం : రూ. 900
రబీలో సాగైన పంట : 1,32,510
ఎకరాలు
ప్రస్తుతం
మార్కెట్లో
క్వింటా:
రూ. 1,500
సాగు
చేసిన రైతుల : 60,777
మంది
మొక్కజొన్న పంటకు కనీస
మద్దతు ధర కరువు
నేటికీ జాడ లేని కొనుగోలు కేంద్రాలు
ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
క్వింటాపై రూ. 800 –రూ. 900 వరకు నష్టపోతున్న రైతులు


