బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న యరపతినేని | - | Sakshi
Sakshi News home page

బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న యరపతినేని

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న యరపతినేని ● గురజాలలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఏం మంచి జరిగిందో చెప్పాలన్నారు. తాగునీరు కలుషితం జరిగి పిడుగురాళ్లలో ఐదుగురు, దాచేపల్లిలో ఇద్దరు మృత్యువాత పడ్డారని, పిన్నెల్లిలో మందా సాల్మన్‌ను, చర్లగుడిపాడులో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారన్నారు. పల్నాడులో ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని కాసు మండిపడ్డారు. బీసీలే కదా ఏం చేస్తారు అని కూటమి నాయకులు అనుకుంటున్నారని.. కానీ వారే కూటమి బీటలను నేలకూల్చుతారని హెచ్చరించారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పద్దతి మార్చుకోవాలన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు(కేవి), నాయకులు వేముల చలమయ్య, వి.అమరారెడ్డి, సిద్దాడపు గాంధీ, కొమ్మినేని బుజ్జి, జంజనం తిరుపతిరావు, బీసీ నాయకులు తదితరులున్నారు.

గురజాల: తన నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బీసీ యువకులు హత్యకు గురైతే.. వారి కుటుంబ సభ్యులను కనీసం పరామర్శించకుండా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చర్లగుడిపాడు గ్రామానికి చెందిన కాకుమాను భావనాబుషీ, భువనగిరి శ్రీనివాసరావులను ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు అతి కిరాతంగా చంపి కాలువలో పడవేసిన సంఘటన తెలిసిందే. వారి కుటుంబాలను శనివారం మాజీ ఎమ్మెల్యే కాసు పరామర్శించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు చంపి కాలువలో పడవేస్తే స్టేషన్‌లో కనీసం పట్టించుకోలేదన్నారు. వారి మృతదేహాలను వెతకడానికి కూడా పోలీసులు ఏ మాత్రం సహాయం చేయలేదని మృతుల బంధువులే కాలువ కట్టవెంట వెళ్లి మృతదేహాలను 10 రోజులు తరువాత కనుగొన్నారన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావుకు కనీసం మానవత్వం కూడా లేదని దుయ్యబట్టారు. ఘటన జరిగి ఇప్పటికి సుమారుగా రెండు నెలలు కావస్తున్నా నేటికీ యరపతినేని వారి కుటుంబాలను పరామర్శించలేదన్నారు. బాధితులను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్లి జరిగిన విషయాన్ని చెప్పామని.. ఆయన స్పందించి మన ప్రభుత్వం రాగానే సీబీసీఐడీ వేసి విచారణ చేపట్టి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. పిల్లల అభివృద్ధి కొరకు పొలాన్ని వారికి కేటాయించి వారికి తోడుగా ఉంటామన్నారు.

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement